ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన వైరస్లలో 'ఎబోలా' ఒకటి
May 26, 2026
ఇటీవలి కాలంలో ప్రప...
READ MORE
ఎండలు మండిపోతున్నాయి. చరిత్రలోనే అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా 2026 మార్చి నమోదైందని యూరప్కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వెల్లడించింది. ఈ పెరిగిన ఉష్ణోగ్రతలు సామాన్యులకే కాకుండా,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పెను సవాలుగా మారనున్నాయి.
శరీరంపై వేడి ప్రభావం ఎలా ఉంటుంది అంటే..?సాధారణంగా మన శరీరం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద సమర్థంగా పనిచేస్తుంది. అయితే బయట ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, శరీరాన్ని చల్లబరచుకోవడానికి గుండె సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలోని లవణాలు, నీటి శాతం తగ్గుతాయి.
ఎవరు అప్రమత్తంగా ఉండాలి..? 1. గుండె జబ్బులు ఉన్నవారు..ఎండ తీవ్రత పెరిగితే శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇప్పటికే గుండె వైఫల్యం, కరోనరీ ఆర్టరీ వ్యాధి, రక్తపోటు సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారవచ్చు.
2. మధుమేహ వ్యాధిగ్రస్తులు..అధిక వేడి వల్ల శరీరంలో ఇన్సులిన్ వినియోగంలో మార్పులు వస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar levels) అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. మధుమేహం వల్ల నరాలు, చెమట గ్రంథులు దెబ్బతిన్న వారికి శరీరాన్ని చల్లబరుచుకోవడం కష్టమవుతుంది. ముఖ్యంగా ఇన్సులిన్ వాడేవారు మందులను చల్లని ప్రదేశంలో ఉంచాలి, లేదంటే వాటి ప్రభావం తగ్గే అవకాశం ఉంది.
3. ఇతర అనారోగ్య సమస్యలు..కిడ్నీ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కూడా ఈ వడగాల్పుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ద్రవ పదార్థాలు..దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగుతూ ఉండాలి.
ఆహారం విషయంలో మసాలాలు, వేపుళ్లకు దూరంగా ఉండి.. పీచు పదార్థాలు, పండ్లు తీసుకోవాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం ఉత్తమం. వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి.
May 26, 2026
ఇటీవలి కాలంలో ప్రప...
READ MOREMay 26, 2026
మారుతున్న జీవనశైల...
READ MOREMay 25, 2026
చాలా మంది చర్మం జి...
READ MOREMay 23, 2026
వేసవి కాలంలో భానుడ...
READ MORE