డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఎబోలా వైరస్ ఇంకా వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం ఇప్పటివరకు 1,406 కేసులు నమోదవగా, 438 మంది ప్రాణాలు కోల్పోయారు.
గత రెండు వారాలుగా రోజుకు సగటున 38 కొత్త కేసులు నమోదవుతున్నట్లు WHO తెలిపింది.
వ్యాధిని నియంత్రించేందుకు కాంగో ప్రభుత్వం, WHO కలిసి పలు చర్యలు చేపడుతున్నాయి. కొత్త ల్యాబ్లు ఏర్పాటు చేయడం, పరీక్షల సంఖ్య పెంచడం, రోగులను త్వరగా గుర్తించి చికిత్స అందించడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
అయితే కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య సిబ్బందిపై దాడులు, హింసాత్మక ఘటనలు సహాయక చర్యలకు అడ్డంకిగా మారుతున్నాయని WHO వెల్లడించింది.
ఎబోలా లక్షణాలు
- అధిక జ్వరం
- తీవ్రమైన తలనొప్పి
- వాంతులు
- విరేచనాలు
- శరీర బలహీనత
- తీవ్రమైన పరిస్థితుల్లో రక్తస్రావం
లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని WHO సూచిస్తోంది.

